చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 18 : రాధికా సప్తస్వర రాగ వర్షిణి ఈవెంట్స్ " ఆధ్వర్యంలో
రాధికా రాగరంజని - అఖిల స్వరమంజరి సమర్పణలో
"సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర " పేరిట సినీ సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు.
రాధిక శర్మ నిర్వహణలో
మధుర గాయకులు దేవకృష్ణ,
కూరపాటి రాంగోపాల్ సీతా రామయ్య, ఏ. నాగరాజ శర్మ
అజయ్ కుమార్ వారణాసి
డా. శాస్త్రి కొండేటి, సుబ్బ రెడ్డి, గాన సరస్వతి అఖిల , బి.మోహన కృష్ణ తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. సహ వ్యవస్థాపకులు, వెంపటి వెంకటేశ్వర్లు సమన్వయ కర్తగా
వ్యవహరించారు.






