హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9:
ఈ సందర్భంగా ACP Sir గారు నిర్వాహకులతో మాట్లాడి, పండుగను ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పలు సూచనలు చేశారు. అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్స్ మరియు వాయిద్యాలను వినియోగించవద్దని, సాధ్యమైనంత వరకు సంప్రదాయ బ్యాండ్ మరియు సంప్రదాయ వాయిద్యాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.
పండుగ సందర్భంగా మద్యం సేవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అసాంఘిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ACP Sir గారు నిర్వాహకులకు మరియు భక్తులకు సూచించారు.
అదేవిధంగా, వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు మరియు ఇతర నిమజ్జన ప్రదేశాల వద్ద భక్తుల భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని తెలిపారు.
వినాయక చవితి పండుగను శాంతియుతంగా, సురక్షితంగా మరియు సజావుగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ACP Sir గారు కోరారు.
ఈ సమావేశంలో జీడిమెట్ల PS SHO శ్రీ కె. రవి కుమార్ గారు, సెక్టార్ SIs శ్రీ ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, శ్యామ్ బాబు, రామచంద్రయ్య మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





