హైదరాబాద్ ,నాంపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా "మేరా భారత్ మహాాన్ డాన్స్ ఫెస్ట్" తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించారు. హార్టికల్చర్. అసిస్టెంట్ డైరెక్టర్
డి. చక్రపాణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన వారికి 'ప్రైడ్ ఆఫ్ ఇండియా'అవార్డుల ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వివిధ రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి అవార్డులను ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. శిఖరం సంస్థ విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు కళాకారులతో పాటు సామాజిక సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ డా. జవ్వాజి అంజయ్య గౌడ్
థియేటర్ ఆర్టిస్ట్, డి. నాగేందర్,
కథక్ కళాక్షేత్ర ఫౌండర్
అంజుబాబు, సామాజికవేత్త
డా. వీరభోగ వసంత రాయలు, సంస్థ అధ్యక్షుడు గొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాఖ్యాతగా యోగిత వ్యవహరించారు.





