పాలటెక్నిక్ విద్యార్థులతో కలిపి పోస్ట్ కార్డులు పంపిన BRSV నాయకులు..
సూర్యాపేట: ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31: శక్తి స్కీమ్ (G.O. నం.97) ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి బిఆర్ఎస్వీ నాయకులు విద్యార్థులతో కలిసి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా BRSV నాయకులు బంటు సందీప్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న శక్తి స్కీమ్ (G.O. నం.97)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్కార్డుల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులతో పోస్ట్కార్డుల ఉద్యమం నిర్వహించమన్నారు. శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థుల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ నాయకులు ఖమ్మంపాటి ఉదయ్, పడిదల నవనీత్, బొల్లం వినయ్, ఎలగబోయిన వంశీ, సాయి, వెంకట్, అభి తదితరులు పాల్గొన్నారు.





