హాలియా: హాలియా పట్టణంలోని పేరూరు రోడ్డులో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపయ్యను అనుముల మండల ఆర్యవైశ్య అధ్యక్షులు పోలా సైదులు గుప్తా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులను ఆయన అభినందించారు.
కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.





