రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22; ప్రముఖ రచయిత్రి జ్యోతిర్మయి మళ్ళ రచించిన 'మట్టి నా మనసు' కవితా సంపుటి ఆవిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతి లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రసిద్ధ చిత్రకారులు రచయిత కళా రత్న బ్లిం పాల్గొని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిరణ్మయి కవితలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, ఆమె కవిత్వాలు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా అనేక పుస్తకాలు రచించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. ప్రసిద్ధ కవి డాక్టర్ డి . విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి బయోటిక్ ఆర్గనైజేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్
డిఎన్ వి రామ శర్మ , గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ అధ్యక్షురాలు గిడుగు కాంతి కృష్ణ , ప్రముఖ కవి శనిగే రచయిత డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ వహేద్ రచయిత్రి డాక్టర్ సమ్మెట విజయ , సినీ నటులు బులుసు రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. కళారత్న, రచయిత డాక్టర్ బిక్కి కృష్ణ పుస్తక సమీక్ష చేశారు.





