హైదారాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30:
ప్రముఖ నాట్య గురువులు వెంకట గంగాధర్, లక్ష్మి వెంపడప్ప శిష్యురాలు కూచిపూడి కళాకారిణి పార్థవి రెడ్డి కూచిపూడి రంగప్రవేశం నిశ్రింకాల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.
శ్రీదేవి నృత్యాలయ వ్యవస్థాపకురాలు శీలా ఉన్నికృష్ణన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పి. క్రాంతి, పి. మహేశ్వర రెడ్డి దంపతుల కుమార్తె పార్థవి రెడ్డి,
దూరదర్శన్ 'బి-గ్రేడ్' ఆర్టిస్ట్ గా గత పదేళ్లుగా వెంకట గంగాధర్, లక్ష్మి వెంపడప్పల వద్ద ప్రతిష్టాత్మకమైన నిశ్రింకాల డ్యాన్స్ అకాడమీలో కూచిపూడి నృత్యంలో కఠిన శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శోభా కొరంబిల్, డాక్టర్ వేదాంతం సత్య నరసింహ శాస్త్రి పాల్గొని అభినందించారు. సభకు ముందు పార్థవి రెడ్డి, విఘ్నరాజ భజే, శివస్తుతి,
బాల గోపాల తరంగం,
దశావతారం తదితర అంశాలపై ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.






