హైదరాబాద్, రవీంద్ర భారతి ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31 :
జానపద కళాకారులు మనస్ఫూర్తిగా అందించిన సత్కారం తన జీవితంలో మర్చిపోలేనిదని ప్రముఖ సినీ నటుడు ,పద్మశ్రీ' పురస్కార గ్రహీత
డా. మాగంటి మురళీమోహన్ అన్నారు. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 'సాంస్కృతికబంధు' సాರಿపల్లి కొండలరావు సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో "ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం" అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మురళీమోహన్ పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులు ఏ పని చేసినా మనసుతో చేస్తారని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం మారుమున ఉన్న జానపద కళాకారులను గుర్తించి పద్మశ్రీ అవార్డులను ఇవ్వడం విశేషమన్నారు. డాక్టర్ కేవీ రమణ చారి అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. సారిపల్లి కొండలరావు సారధ్యంలో జానపద కళాకారులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం మురళీమోహన్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా జానపద కళాకారుల సమక్షంలో సత్కరించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో
సాంస్కృతికబంధు, డా. అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షులు
సాರಿపల్లి కొండలరావు ,
యువకళావాహిని అధ్యక్షుడు
లంక లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు
వంగా శ్రీనివాస్ గౌడ్, , సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.






