చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : శ్రీవాగ్దేవి నాట్యస్థల్ వార్షికోత్సవ వేడుకలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనకదుర్గ మార్చాలయం వ్యవస్థాపకురాలు నాట్య గురువు నిర్మల ప్రభాకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలన్నారు. అనంతరం
మహిషాసుర మర్ధిని,
శివ తాండవం, ప్రహ్లాద పట్టాభిషేకం, రాగమాలిక రాగం,
కాలభైరవాష్టకం, రాగమాలిక రాగం, సంచార ఆధార, ఆనందభైరవి రాగం, ఆది తాళం
అలరులు కురియగ: శంకరాభరణం తదితర అంశాలపై ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.






