హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 31:
సికింద్రాబాద్ లోని న్యూ క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాష్ రావు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం క్లబ్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో నోముల ప్రకాష్ రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో సోమవారం ఆయన వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఈ సందర్భంగా నోముల ప్రకాష్ రావుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ప్రకాష్ గుప్త, నార్ల దీపక్ గుప్త ఉన్నారు.





