నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
హాలియా: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణపై హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఫైలేరియా వ్యాధిగ్రస్తుల్లో అర్హులైన వారు చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కొత్త దరఖాస్తు ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి, అవసరమైన తాజా ధ్రువపత్రాలతో కలిసి ఆగస్టు 31, 2026లోగా సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కోసం హాలియా మున్సిపల్ కార్యాలయంలో …





