ట్రై నెట్ న్యూస్ 15 ఆగస్ట్ 2026B నట్ రాజ్
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు మాణిక్యేశ్వరి నగర్లోని లాల్ బహదూర్ కమిటీ హాల్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జాతీయ త్రివర్ణ పతాకాన్ని సీనియర్ సిటిజన్ అయిన సాకె పరందామ్ గారు ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమగ్రతకు, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమం ముగింపులో స్థానికులకు, చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ వేడుకల్లో ప్రముఖులు ఎస్. పరంధామ్, ఎమ్. వెంకటేష్, బి. నటరాజ్, నగేష్, ఎస్. మహేష్, ఎమ్. నరసింహులు గౌడ్, బి. గుండారెడ్డి, ఇద్దరు య్య, బి. మహేష్ లతో పాటు కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





