హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :
బిఎన్ డిఎస్ ఆర్ కెఎల్ కళా సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కళాకారులకు, సామాజిక సేవకులకు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సంగీత నాట్య వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు మాణిక్యం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమర గాయకుడు ఘంటసాల, ప్రముఖ గాయకుడు ఏసుదాసు స్ఫూర్తిని తీసుకొని ఈ పురస్కారాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కళాకారులతో పాటు వివిధ రంగాలలో సోవలందించిన వారికి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు డా. నగేష్ కురువ పాల్గొన్నారు.






