నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
హాలియా: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి హాలియా ప్రాంతానికి పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. అనుముల మండలం హాలియాలోని శ్రీ శ్లోక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ క్రీడాకారులను అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్లోక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ కుకుడాల ఆంజనేయులు హాజరై క్రీడాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల జీవితంలో క్రీడల ప్రాధాన్యత ఎంతో గొప్పదని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాధ్య, డైరెక్టర్ గుజ్జర్ నవీన్ కుమార్, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





