హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 8:
ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ (కిశోర్ దా) స్మృతిలో చిత్రపు బ్రదర్స్ కల్చరల్ అండ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘గాతా రహే హమారా దిల్ – సీజన్ 15’ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తున్నారు.
హిందీ, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రసిద్ధ గీతాలను కరావోకే రూపంలో గాయనీ గాయకులు ఆలపించి సంగీతాభిమానులను అలరించనున్నారు. కార్యక్రమంలో ఎస్.వి. రావు, సుబ్రహ్మణ్యం డి., బి. చిరంజీవి, సింధుజ, జ్యోతి గాన సరస్వతి, జయలలిత ఎ., వి. సవిత శ్రీ తదితరులు పాల్గొని తమ గాన ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమంలో సి. రవీందర్, సి. ప్రకాష్, సంగీత సాంస్కృతిక సేవారత్న సి. పురుషోత్తం, అశోక్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, దీక్షితులు కళావేదికలో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సంగీత విభావరి జరగనుంది. కార్యక్రమాన్ని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






