చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 14 :
త్రివేణి సంగమం కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో "సీజన్ - 112 మ్యూజికల్ నైట్" చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు , అధ్యక్షులు: డా. రాజా రామన్న , డా. లయన్ వై. మురళీధరుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.





