శ్రీ మానస ఆర్ట్ థియేటర్s, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బహుభాషా కవిసమ్మేళనం,మానవతావాది శ్రీ ఉమ్మడిసింగు హనుమంతరావు స్మారక సాహితీ పురస్కారం ప్రదానోత్సవం
గానసభ కళావేదికలో ఘనంగా నిర్వహించారు.
సాధన నరసింహాచార్య సభకు అధ్యక్షత వహించారు.ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు డాక్టర్ నర్మదా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కీర్తి శేషులు హనుమంతరావు చిత్రపటానికి పుష్పమాల సమర్పించి నివాళి అర్పించారు.
అనంతరం పాత్రికేయులు జయసూర్య నిర్వహణలో కవిసమ్మేళనం జరిగింది.
అనంతరంప్రముఖ సాహితీవేత్త ఆచార్య టి.గౌరీశంకర్ కిపురస్కారం అందచేసి ఘనంగా సత్కారం చేశారు.
కవులను సత్కరించారు. ఇంకా సభలో కడియాల ప్రభాకర్, జయసూర్య,బండారుపల్లి రామ చంద్రరావు, కోకా భవాని,మిద్దె సురేష్ తదితరులు ప్రసంగించారు.
మానస రఘుశ్రీ సభాసమన్వయం. గావించారు





