ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు09:
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రామ్ప్(Raising and Accelerating MSME Performance) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఎల్డీఎం వీరన్న విద్యార్థులకు వ్యాపార అవకాశాలు, పారిశ్రామికవేత్తగా ఎదగడం, బ్యాంకింగ్ సేవలు మరియు ఆర్థిక వనరులకు ప్రాప్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.కోఆర్డినేటర్ ధనుంజయ్ మరియు జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ విద్యార్థులకు వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం, ప్రభుత్వ పథకాలు, రుణ సౌకర్యాలు, మార్కెట్ అవకాశాలు, మార్కెటింగ్ మరియు స్వయం ఉపాధి అవకాశాలు గురించి వివరించారు.అనంతరం మనోజ్ కుమార్ విద్యార్థులకు ఆర్థిక అవకాశాలు, వ్యాపార అభివృద్ధి మరియు అందుబాటులో ఉన్న వివిధ సహాయ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామానాయుడు అసిస్టెంట్ మేనేజర్ మహేష్, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచనా విధానం, స్వయం ఉపాధి, ఆర్థిక అవగాహన మరియు మార్కెట్ అవకాశాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు.






