రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 15 :
ఆధునిక వీధినాటికలను ప్రోత్సహించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంగస్థల, సినీ నటి, రచయిత్రి, దర్శకురాలు శ్రీజ సాదినేని అన్నారు. అలవోకగా చెప్పే సామెతలకు దృశ్యరూపం ఇచ్చి వేదికపై ప్రదర్శించడం అంత తేలికైన విషయం కాదని చెప్పారు . ఈ సందర్భంగా శ్రీజ మీడియాతో మాట్లాడుతూ .. వంశీ ఆర్ట్ థియేటర్స్ యాభై ఐదవ వార్షికోత్సవ వేడుకల సందర్బంగా శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించిన కార్యక్రమంలో ఆధునిక వీధినాటికగా శ్రీజయా ఆర్ట్స్ హైదరాబాద్ ప్రదర్శించిన తంత్రసామెతం ఆహూతులను అలరించిందన్నారు. నేటి యువత తెలుగుకు దూరమవుతున్న నేపథ్యంలో ఇలాంటి కళారూపాల ద్వారా వారికి మంచి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందని ఆమె తెలిపారు. సామెతలు రోజూ వినేవారికి వాటి అర్ధం కూడా సరిగా తెలియదని, మాటల్లో చెప్పడం కంటే నాటకం ద్వారా చూపించడంలో ఆ సామెతలకు అర్ధం అర్ధవంతంగా అందరికీ చేర్చడంలో తమ టీం సక్సెస్ అయిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీజ సాదినేని నటించి, దర్శకత్వం వహించిన ఈ నాటికలో శశిధర్ ఘణపురం, హైకోర్టు శ్రీలక్ష్మి, ఆర్. కే. యోధ, అఖిల్ శ్రీవత్స నటించి అందరిని ఆకట్టుకుంది.








