హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 4: మూషిరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జన్మదిన వేడుకలు శుక్రవారం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా నిర్వహించారు. కవి, వ్యాసకర్త, సమీక్షకులు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు మిద్దె సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ముఠా గోపాల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను అందించడం అభినందనీయమన్నారు . ముఠా గోపాల్ ముషీరాబాద్ నియోజకవర్గంలో మచ్చ లేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నారని తెలిపారు. ముషీరాబాద్ ప్రజల అండ ముఠా గోపాల్ కు ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
యువత విద్యా రంగంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు . కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ రాకేష్, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, సీనియర్ నాయకులు ముఠా నరేష్, శ్రీనివాస్ గుప్తా, సత్యనారాయణ, ప్రేమ్, జాగీర్, రవి శంకర్ గుప్తా, కుమారస్వామి, సంతోష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.






