హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 29 : 'స్వర నీరాజనం' ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు సివి ప్రసాద్ నిర్వహణలో చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగర్, యాంకర్ లక్ష్మీతులసి, గాయకుడు రమణ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయనీ గాయకులు గౌరి, లక్ష్మీరత్నం, రామలక్ష్మి శశిరేఖ, జ్యోతిర్మయి , సాయిపావని, వెంకటేశ్వరరావు
శ్రీనివాస మూర్తి, శంకర్ , రమేష్
శ్రీనివాస పరుస, గోపీకృష్ణ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






