రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 20 : ప్రముఖ కళా సాంస్కృతిక సంస్థ ‘మయూరి ఆర్ట్స్’ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రవీంద్ర భారతి ప్రధాన వేదికలో నిర్వహించారు . ఈ సందర్భంగా
180 మందిక ళాకారులు, 18 గ్రూపులు, 80 నిమిషాల వ్యవధిలో 30 దేశభక్తి గీతాలపై నృత్యాలను ప్రదర్శించి ‘జై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో రికార్డును నమోదు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొని కళాకారులకు
రికార్డ్ ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం పలువురికి "ఇండియన్ హనరబుల్ అవార్డ్స్ 2026"ను అందజేశారు.








