అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు
విరజిల్లాలి
*ఉజ్వల సంస్థ అధ్యక్షురాలు ఎం. లక్ష్మి
రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21: పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం పండగ సందర్భంగా అంబర్ పేట్ లో నియోజకవర్గంలో ఆలయాలు కిక్కిరి సాయి. మహిళలు ఉదయం నుంచే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉజ్వల సంస్థ అధ్యక్షురాలు ఎం. లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వరలక్ష్మీ అమ్మవారి దివ్య కృపాకటాక్షాలతో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ధనసంపదలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.





