హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 27:
ఈరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని హరిహర కళా భవన్ లో వున్న తన కార్యాలయములో, అమీర్ పేట్ డిప్యూటీ కమిషనర్ మరియు సనత్ నగర్ నియోజకవర్గ ERO శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యంలో SIR-2 పై అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బీజేపీ తరపున మాజీ మంత్రివర్యులు, NDMA మాజీ ఉపాధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర SIR కన్వీనర్ గౌరవనీయులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ఎన్యుమరేషన్ ఫారాలు అందని ఓటర్లకు నోటీసులు ఇచ్చి, పకడ్బందీగా విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ERO గారిని డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడితోనైనా పక్షపాతంగా వ్యవహరించి, అర్హత కలిగిన ఓటర్ల ఓట్లను తొలగిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అధికార కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.





