సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17 : గణేష్ సురక్ష సంకల్ప్-2026 లో భాగంగా గురువారం మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ జైల్ఖానా ప్రాంతంలోని గణేష్ మండపం వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండపం నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ జి.రామకృష్ణ, సెక్టార్ ఎస్ఐ కె.మహేశ్వరి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి.రజితా రెడ్డి, సహచరి సభ్యులు శివాని, శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 80 మంది భక్తులు, యువత, స్థానిక ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పండుగ సందర్భంగా వాహనదారులు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై మార్కెట్ పోలీసుల అవగాహన..
As part of Ganesh Suraksha Sankalp-2026, Market Police organized a road safety awareness program at a Ganesh pandal in Old Jailkhana.
nagendra17 September 2026, 11:40 PM0 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ 77వ ఆవిర్భావ దినోత్సవం

ఏఐ జర్నలిజం పుస్తక రచయిత ముద్దం నరసింహస్వామిని సత్కరించిన ఎన్ఎఫ్ఎస్యూ వీసీ

NFSU Vice Chancellor Dr. J.M. Vyas felicitated technical journalism expert Muddam Narasimha Swamy, author of 'Artificial Intelligence in Modern Journalism'.
మిగతా చదవండి →ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

తెలంగాణ క్రీడా శక్తిని మరింత బలోపేతం చేద్దాం ఎల్. బి.స్టేడియంలోఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

Praja Palana Day celebrations were grandly held at LB Stadium under the auspices of the Sports Authority of Telangana, with a call to make the state a leader in sports.
మిగతా చదవండి →