హైదరాబాద్, ప్రకాశ్నగర్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 1 :
ప్రకాశ్నగర్లో లాస్య, రాఘవ దంపతుల నివాసంలో మంగళగౌరీ పూజ భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. రాధిక, సారిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి లాస్య–రాఘవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడితో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.





