ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు 07:
ఉద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా సెప్టెంబర్ 10న హైదరాబాద్లో నిర్వహించనున్న“చలో హైదరాబాద్ – హక్కుల సాధన సభ”ను విజయవంతం చేయాలని టిజిఈజెఎసి యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం రోజున ఆత్మకూరు(ఎం)మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం, గోడపత్రిక ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టిజిఈజెఎసి సెక్రటరీ జనరల్ ధరణికోట భగత్ మాట్లాడుతూ 2వ పిఆర్సీ అమలు, పెండింగ్ 6 డిఎల విడుదల, పూర్తిస్థాయి క్యాష్లెస్ ఈహెచ్ఎస్,ఓపిఎస్ పునరుద్ధరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు మరియు జీవో 317 బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు కానుకలు కాదని, శ్రమకు తగిన హక్కులని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.





