చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21: ప్రజ్ఞా ఆర్ట్స్ ఆధ్వర్యంలో "మధుర రాగ రంజని" పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ
కళా దీక్షితులు కళావేదిక'లో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రేడియో నాటక విభాగాధిపతి మద్దిపట్ల విశ్వనాథ్ , గౌరవ అతిథిగా సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం శ్రీ వడ్లకొండ వెంకటరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా "రాగ కళా సరస్వతి" శివరమ్య ధరణిప్రగడ
నిర్వహణలో గాయనీ, గాయకులు సంతోష్ వేణుగోపాల్ , వెంకటేశ్వర్లు రవికుమార్, లక్ష్మీగోపాల్, సవితాశ్రీ, పద్మశ్రీ, అలరించిన సినీ గీతాలు అలరించాయి.








