ట్రైనెట్ న్యూస్,యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు 08:
బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలంధర్ రెడ్డి అధ్యక్షతన పోచంపల్లి మండల కమిటీ అధ్యక్షులుగా చెరుకు లింగస్వామి సెక్రటరీగా బుగ్గ లింగస్వామి కోశాధికారిగా ఎన్ సజీవ్ కుమార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్స్ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని వారికి అండగా ఉండి అన్ని రకాలు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతు నాపై నమ్మకంతో మండల అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మండలంలోని పాఠశాలల సమర్థవంతంగా నిర్వహించేందుకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి చిట్టిబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నోముల బసవ రెడ్డి, జిల్లా కోశాధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణంరాజు, మల్లేశం,రావుల జంగయ్య, జానీ,వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.





