చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22:
మెగాస్టార్, పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 71వ జన్మదినం సందర్భంగా "రామ్కుమార్ కళారావిందం" సమర్పణలో "71 బ్లాక్ బస్టర్ హిట్స్ ఆఫ్ చిరు" అనే సాంస్కృతిక వేదిక మ్యూజికల్ బోనంజా కార్యక్రమాన్ని
త్యాగరాయ గానసభలోని
కళాసుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటుడు నారాయణ రావుకు
జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేశారు. డాక్టర్ వంశీ రామరాజు,
సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గాయకుడు త్రినాధరావు పాల్గొన్నారు.









