రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 9 :
ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వర్సిటీ 85వ పట్టా ప్రదానోత్సవంలో (కాన్వోకేషన్) అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన కోమటిరెడ్డి మదన్ ఆంగ్ల విభాగం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షత వహించగా, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సమక్షంలో మదన్కు ఈ పీహెచ్డీ పట్టాను అందజేశారు. డాక్టర్ కోమటిరెడ్డి మదన్ ఓయూ ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు పర్యవేక్షణలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పాపిరెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ మదన్ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా సేవలందిస్తున్నారు. ఆంగ్ల సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనకు, పట్టుదలకు దక్కిన ఈ ఉన్నత పురస్కారం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు డాక్టర్ మదన్ను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.





