ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:22 pm

గురువారం

10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:22 pm

SENSEX74,764-2.29%
NIFTY23,459-1.84%
హైదరాబాద్ 22K₹1,45,621/10g-0.91%
హైదరాబాద్ 24K₹1,58,859/10g-0.91%
వెండి₹2,24,978/kg+1.53%

తాజా వార్తలు

కోమటిరెడ్డి మదన్‌ కు పీహెచ్‌డీ పట్టా ప్రదానం

Komatireddy Madan received his PhD in English from Osmania University during its 85th convocation ceremony held in Hyderabad.

nagendra10 September 2026, 1:50 AM0 చూసులుtrinetnews.com
కోమటిరెడ్డి మదన్‌ కు పీహెచ్‌డీ పట్టా ప్రదానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 9 :

ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వర్సిటీ 85వ పట్టా ప్రదానోత్సవంలో (కాన్వోకేషన్) అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన కోమటిరెడ్డి మదన్ ఆంగ్ల విభాగం నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షత వహించగా, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సమక్షంలో మదన్‌కు ఈ పీహెచ్‌డీ పట్టాను అందజేశారు. డాక్టర్ కోమటిరెడ్డి మదన్ ఓయూ ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు పర్యవేక్షణలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పాపిరెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ మదన్ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు. ఆంగ్ల సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనకు, పట్టుదలకు దక్కిన ఈ ఉన్నత పురస్కారం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు డాక్టర్ మదన్‌ను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మిగతా చదవండి →

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.

మిగతా చదవండి →