ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం11 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:21 pm

శుక్రవారం

11 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:21 pm

SENSEX74,224-2.51%
NIFTY23,258-2.19%
హైదరాబాద్ 22K₹1,43,209/10g-0.76%
హైదరాబాద్ 24K₹1,56,228/10g-0.76%
వెండి₹2,11,978/kg-3.73%

తాజా వార్తలు

దళితులు తాకిన ఫామ్ హౌస్ నేల మలినమైందని పసుపు నీళ్లుజల్లించిన కెసిఆర్ దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెల్లరమేష్ మాదిగ డిమాండ్ చేశారు.

MRPS state working president Kurella Ramesh Madiga demanded a public apology from KCR for purifying his farm house with turmeric water after Dalits visited it.

nagendra11 September 2026, 1:00 AM0 చూసులుtrinetnews.com
దళితులు తాకిన ఫామ్ హౌస్ నేల మలినమైందని పసుపు నీళ్లుజల్లించిన కెసిఆర్ దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెల్లరమేష్ మాదిగ డిమాండ్ చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు10:

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్తున్న వారిని అడ్డుకున్న పోలీస్ వాళ్లపై దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగి దౌర్జన్యానికి పాల్పడుతూ అదే సమయంలో శాసనసభాపతి అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ళని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును బర్తరపు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా దళితులు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్భంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాల మాదిగలు ఏకమై కేసీఆర్ ఫామ్ ముట్టడించి మీరు ఆ సంఘటనకు బాధ్యత వహించాలని నిరసన కార్యక్రమం చేసిన సందర్భంలో చేసి వెళ్లిపోయిన తర్వాత దళితులు తాకిన ఫామ్ హౌస్ ప్రాంగణం అపవిత్రమైందని పసుపు నీళ్లతోశుద్ధి చేయించడం అంటరానితనాన్ని పెంచి పోషించడమేనని వారు విమర్శించారు.ఎందుకంటే కెసిఆర్ కు దళితులపై ఉన్నది ప్రేమ కాదు వివక్షానీ అర్థమైతుంది అన్నారు. ఎందుకంటే తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు. దళితులను వంచించి మోసం చేయటానికి ఇది నిదర్శనమని వారన్నారు.ఇప్పటికైనా కేసీఆర్ పత్రిక ముఖంగా దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే జిల్లావ్యాప్తంగా మాల మాదిగలు ఏకమై దిష్టిబొమ్మలు తగలపెడతామని మరొకసారి కెసిఆర్ ఫామ్ హౌస్ ను వేలాది మందితో ముట్టడిస్తామని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థినీల రక్షణలో ప్రభుత్వాలు విఫలం ఢిల్లీలో కదిలే బస్సులో విద్యార్థినిపై అత్యాచార ఘటన దీనికి నిదర్శనం

విద్యార్థినీల రక్షణలో ప్రభుత్వాలు విఫలం  ఢిల్లీలో కదిలే బస్సులో విద్యార్థినిపై అత్యాచార ఘటన దీనికి నిదర్శనం

SFI national and state leaders criticized central and state governments for failing to ensure the safety of female students, highlighting the recent horrific bus assault case in Delhi.

మిగతా చదవండి →