రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21 : దశాబ్దాలుగా బిగ్ డేటా క్లినికల్ అనలిటిక్స్ రంగాలలో అందించిన విశేష సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు గుర్తింపుగా కట్టా సురేష్ కి ప్రతిష్టాత్మకమైన
ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్
(ఎన్ఆర్ఐవీఏ) 8వ గ్లోబల్ కన్వెన్షన్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మాజీ చైర్మన్ సుంకు జయసింహ, ఏపీ మంత్రి టీజీ భరత్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సురేష్ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి బిగ్ డేటా అనే భావన ప్రాచుర్యంలో లేని 1997లోనే దూరదృష్టితో సామా టెక్నాలజీస్ ను స్థాపించారని పేర్కొన్నారు . భవిష్యత్తులో భారీ స్థాయి డేటా ప్రాధాన్యతను ముందుగానే గుర్తించిన ఆయన. డేటాను విశ్లేషించి ఉపయోగకరమైన సమాచారంగా మార్చే దిశగా సంస్థను అభివృద్ధి చేశారు. కట్టా సురేష్ నాయకత్వంలో సామా టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన బిగ్ డేటా ఆధారిత క్లినికల్ అనలిటిక్స్ సాంకేతికతలు కోవిడ్- 19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి. క్లినికల్ ట్రయల్ డేటా విశ్లేషణ సంబంధించిన భారీ డేటాను విశ్లేషించడంలో, నిర్ణయ ప్రక్రియలను వేగవంతం చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అతి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంలో ఈ పరిశోధనలు ఒక కీలక మైలురాయిగా నిలిచాయి. ఈ విధంగా సామా టెక్నాలజీస్ "ఏఐ”ఆధారిత క్లినికల్ అనలిటిక్స్' లో ప్రముఖ సంస్థగా ప్రపంచ వైద్యరంగ చరిత్రలో తన స్థానాన్ని ఏర్పరచుకున్నారని తెలిపారు.





