నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
నాగార్జునసాగర్ నియోజకవర్గం: అనుముల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కందుల మదన్ రెడ్డి నియమితులయ్యారు. హాలియాలోని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అధికారికంగా కందుల మదన్ రెడ్డిని సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ప్రకటించారు.
ఈ సందర్భంగా కందుల మదన్ రెడ్డికి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
అనుముల మండలంలోని గ్రామాల అభివృద్ధికి సర్పంచులందరూ సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభ రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, భానుచందర్ రెడ్డి, రవి నాయక్, లాలు నాయక్, పగడాల సైదులు, బిట్టు రవి, బద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు.





