నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
హాలియా: వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా 107వ జయంతి సందర్భంగా హాలియా గ్రేటర్ వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఏడు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సేవా స్ఫూర్తిని చాటేలా వివిధ కార్యక్రమాలను చేపట్టి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పాంపాటి నిర్మలాదేవి, కార్యదర్శి నీలా ఉషారాణి, కోశాధికారి నీలా పద్మ, ప్రాంతీయ కార్యదర్శి కుక్కడపు ఝాన్సీ లక్ష్మి, చార్టర్డ్ ప్రెసిడెంట్ గార్లపాటి శోభ, మారం అనిత, పద్మ, అనిత, సుకన్య, సత్యవతి తదితరులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అలాగే హాలియా గ్రేటర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు కేస శేఖర్, కార్యదర్శి అంకిశెట్టి రమేష్, కోశాధికారి చిట్టిపోలు సురేందర్, ఐపీసీ కొండూరు శోభన్ బాబు, జిల్లా ఇన్చార్జ్ బచ్చు సతీష్, రీజియన్ చైర్మన్ గందే మహేష్, జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు, పాంపాటి వెంకటేశం, దామోదర్, రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి అండగా నిలవడం వాసవి క్లబ్ల ప్రధాన లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు.
కార్యక్రమాల్లో వాసవి క్లబ్ సభ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
జై వాసవి జై జై వాసవి





