ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఆదివారం23 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 6:00 amసూర్యాస్తమయం 6:36 pm

ఆదివారం

23 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 6:00 am

సూర్యాస్తమయం 6:36 pm

SENSEX77,541-0.24%
NIFTY24,252-0.15%
హైదరాబాద్ 22K₹1,53,811/10g+5.95%
హైదరాబాద్ 24K₹1,67,794/10g+5.95%
వెండి₹2,31,070/kg+5.16%

తాజా వార్తలు

జపాన్ దేశ నగోయా నగర "ఫికో" ప్రతినిధుల బృందం హైదరాబాద్ నగర పర్యటన.

A delegation of eight from Nagoya, Japan, visited Hyderabad, where they interacted with locals and distributed scholarships to students.

nagendra22 August 2026, 8:58 PM0 చూసులుtrinetnews.com
జపాన్ దేశ నగోయా నగర "ఫికో" ప్రతినిధుల బృందం హైదరాబాద్ నగర పర్యటన.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22:

"భారత్, జపాన్ దేశ ప్రజల మధ్య స్నేహ సంబంధాలు ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగడం అపూర్వమైన విషయమని రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ ఉప సంచాలకురాలు జి. వసుంధర అన్నారు. "వివిధ దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక మైత్రి కి, స్నేహ సంబంధాలకు స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయడం అభినందనీయమన్నారు.

జపాన్ లోని నగోయా నగరంతో పాటు ఇతర ప్రాంతాలనుంచి నుంచి 8 మంది ప్రతినిధుల బృందం నగర పర్యటనకు విచ్చేసిన సందర్భంగా శనివారం ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆర్గనైజేషన్ యoగ్ మైండ్స్ అంతర్జాతీయ సేవాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సత్కార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె జపాన్ బృంద సభ్యులు కజుహిరో నగాయి, అసాహి నగాయి, తాకేఅకీ హోండా, గోషిమా జున్జి, సాయేకి సోనోకో, స్మిత్ ఆమంద, కానో నోరియో, ఫుకుదా సుతోము లను సత్కరించారు. ఫికో, హైదరాబాద్ అధ్యక్షుడు డా. ఉపేందర్ రెడ్డి జపాన్ ప్రతినిధులను పరిచయం చేస్తూ.. తమ సంస్థ బాలబాలికల కోసం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జపాను దేశ ప్రతినిధులు..

ప్రభుత్వ బాలల పాఠశాల, త్రిశూలపార్కు , బొల్లారం, గ్రామ భారతి ఆశ్రమ పాఠశాల మర్రిగూడెం, దత్తయిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకు స్కాలర్ షిప్ లు, బహుమతులు అందజేశారు. యంగ్ మైండ్స్ రీజినల్ అధ్యక్షుడు కె. చక్రపాణి సభకు అధ్యక్షత వహించి, సంస్థ నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. యంగ్ మైండ్స్ అంతర్జాతీయ సభ్యులు వేమరాజు విజయ కుమార్ సభకు స్వాగతం పలికారు. యంగ్ మైండ్స్ నాయకులు, సభ్యులు బి. వి. నారాయణరావు, అపూర్వ స్వాతి, యు. హెచ్. హరినాథ్ బాబు, రవీంద్ర, వి. రమాదేవి, బి. విశాలాక్షి, జెబివి శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి