హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 27:
సినీ పరిశ్రమలో చెరగని ముద్ర జానకి అని తెలంగాణ రాష్ట్ర
భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. ఏనుగు నరసింహరెడ్డి
అన్నారు. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ ఎస్. జానకి నివాళిగా ఆనంద భైరవి సాంస్కృతిక, సాంఘిక సంస్థ ఆధ్వర్యంలో ‘స్వర నివాళి’ కార్యక్రమం
చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏనుగు నరసింహారెడ్డి పాల్గొని జానకి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానకి భౌతికంగా లేకపోయినా పాట రూపంలో చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారని తెలిపారు. కార్యక్రమంలో తిరుమల బ్యాంకు చైర్మన్
వంగనూరి చంద్రశేఖర్,
ఎం.ఎన్. ఆదిత్య, కోనేరు రంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సినీ నేపద్య నాయకులు మాళవిక పంతుల, సందీప్ లను ఘనంగా సన్మానించారు. సభకు ముందు ప్రముఖ అంతర్జాతీయ గాయని శారదా సాయి నిర్వహణలో గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








