: హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30:
జమున నటన లో నవ రస భావాలు పలికించే ఆకర్షణ క్రమ శిక్షణ కల జీవితం ఆదర్శవంతం అని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇంటర్నేషనల్ నిర్వహణలో ప్రఖ్యాత సినీ నటి జమునా రమణా రావు జయంతి వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జమున కుమార్తె స్రవంతి వంశీ జమునా రమణా రావు మహా నంది అవార్డులు వివిధ రంగాలకు చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తో పాటు విదేశీ ఆంధ్రులు కు బహుకరించి మాట్లాడారు నాకు తల్లి జమున కానీ కోట్లాది ప్రజలకు అభిమాన నటి అన్నది చిన్న నాడు తెలియలేదు అని చెప్పారు కళా కారులకు మరణం లేదని అమ్మ నటించిన సినిమాలు నేటికీ వేల మంది వివిధ మాధ్యమాల్లో చూస్తూ ఉంటారనీ అలా ఆమె శాశ్వతం గా నిలిచి ఉంటారని అన్నారు ఆమె కు నటి భానుమతి అంటే బాగా ఇష్టం అని తెలిపారు రామరాజు అమ్మకి దత్త పుత్రుడు అని చెప్పారు ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ జమున నాడు తెలుగు సినీ పరిశ్రమ లో గ్లామర్ తార అని చెప్పారు సంస్థ అధినేత నిర్వహణలో తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, జానీ భాషా , జానకీ రామ చౌదరి దంపతులు విదేశ ఆంధ్రులు వెంకట్ నాగం దంపతులు కె సంతోష్ కుమార్ దంపతులు కూడా వున్నారు వేదిక పై ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె వి కృష్ణ కుమారి , వ్యాఖ్యాత సుధా మయి గాయని గీతాంజలి సుంకర పల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు








