హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 10,
వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూనే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ పర్యావరణ, ప్రకృతి ప్రేమికుడు, శతాధిక అవార్డుల గ్రహీత రాజయోగి డాక్టర్ చిక్కా దేవదాసు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు
పారంపర్యంగా మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగమని మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కలిసి పోవడంతో చెరువులు, కుంటలు, నదులు కలుషితం కాకుండా ఉంటాయని చిక్కా దేవదాసు అన్నారు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులకు, జలచరాలకు హాని కలిగే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు మట్టి వినాయక విగ్రహాలని కొనుగోలు చేసి పూజించాలని, రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించాలని చిక్కా దేవదాసు కోరారు. వినాయకుని పండుగ రోజులలో ఇండ్లలో మండపాల వద్ద ప్రతి ఒక్కరూ చేనేత కండువాలు చేనేత దుస్తులు ధరించాలని,
పర్యావరణహితమైన సహజ రంగులతో అలంకరించిన మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక కళాకారులు, ఉత్పత్తి కులాలకు కూడా ఉపాధి లభిస్తుందని చిక్కా దేవదాసు తెలిపారు.
మట్టి వినాయకుడు మన సంప్రదాయానికి ప్రతీక, పర్యావరణానికి రక్షణ కవచం కనుక భక్తి పేరుతో ప్రకృతికి హాని చేయకుండా, భక్తితో పాటు బాధ్యతను కూడా పాటించాలని మన చెరువులు, కుంటలు, నదులను పరిశుభ్రంగా ఉంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని చిక్కా దేవదాసు అన్నారు





