నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
నల్లగొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా అమ్మనబోలు గ్రామంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామంలో దేశభక్తి ఉట్టిపడేలా జాతీయ జెండాలతో అలంకరణలు చేపట్టి, ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాపోలు సంతోష్, రాపోలు గాయత్రి ఆధ్వర్యంలో జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా సాక్షిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.
గ్రామస్తులు, యువత, మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు. ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత, అభివృద్ధి కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
🇮🇳 జైహింద్! జై భారత్! వందేమాతరం!




