ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:29 pm

బుధవారం

2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:29 pm

SENSEX76,944-0.68%
NIFTY24,056-0.63%
హైదరాబాద్ 22K₹1,41,712/10g-5.69%
హైదరాబాద్ 24K₹1,54,595/10g-5.69%
వెండి₹2,11,476/kg-7.60%

తాజా వార్తలు

పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలి ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నిరసన

Marking CPS Betrayal Day, lecturers at Government City Junior College wore black badges and demanded the immediate scrapping of the Contributory Pension Scheme.

nagendra2 September 2026, 12:50 AM0 చూసులుtrinetnews.com
పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలి    ప్రభుత్వ సిటీ  జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నిరసన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలి

ప్రభుత్వ సిటీ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నిరసన

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1: సిపీస్

విద్రోహ దినం సందర్భంగా ప్రభుత్వ సిటీ కళాశాలలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు పెన్షన్ ఎంతో కీలకమని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాని వెంటనే అమలు చేయాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ జీవితంలో ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సేవకు అంకితం చేసిన అనంతరం పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పెన్షన్ అనేది కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కాదని, ఉద్యోగి భవిష్యత్ భద్రతకు సంబంధించిన హక్కు అని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్ అంజన్ కుమార్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని సిపిఎస్ విధానంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అధ్యాపకులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →