హైదరాబాద్, అంబర్ పేట్ ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పై నమోదు చేసిన అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు వి . హనుమంత రావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను నివసిస్తూ.. అంబర్ పేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా
హనుమంతరావు మాట్లాడుతూ..
దళితులపై కులవివక్ష, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని కేంద్ర ప్రభుత్వం అణిచివేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్ లక్ష్మణ్ యాదవ్, ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, దిలీప్ కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.





