హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 09:
తెలంగాణలోని జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, ఏపీలోని అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం లభించింది. రాబోయే రెండు గంటల్లో నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, ఈదురుగాలుల నేపథ్యంలో వాహనదారులు, రైతులు, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.





