నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్
హాలియా: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హాలియా మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో సాగిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తొలుత వందేమాతరం గీతాన్ని ఆలపించిన అనంతరం హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపించారు. జైహింద్.. జై భారత్.. వందేమాతరం నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ *గౌని రాజా రమేష్ యాదవ్, కౌన్సిలర్లు నకిరేకంటి అన్నపూర్ణ సైదులు, కుందూరు వెంకటరెడ్డి, కడమంచి ప్రమీల శ్రీను, చిట్టిపోలు శ్రీదేవి కర్ణసాగర్, బొంగరాల యేసురాజు, గౌహర్ జబీన్ మజార్ మోహినిద్దీన్, చెరుపల్లి ముత్యాలు, పిల్లి చంద్రకళ ఆంజనేయులు, దీపావత్ ప్రసాద్, ఎడవల్లి మేరి రంజిత్, కోఆప్షన్ సభ్యులు కొమ్మనబోయిన జయమ్మ, చెన్ను రాజేశ్వరి, వర్కాల శేఖర్ రెడ్డి, ఎండి రషీద్*, మాజీ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
🇮🇳 జైహింద్! జై భారత్! వందేమాతరం!





