ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పల్లెర్ల గ్రామ చేనేత మిశ్రమ సహకార సంఘ భవన ఆవరణలో చేనేత సంఘం అధ్యక్షులు పొడుగు వెంకటేశం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు . అనంతరం చేనేత సహకార సంఘం అధ్యక్షులు పొడుగు వెంకటేశం మాట్లాడుతూ పద్మశాలి జాతిపిత , మాజీ మంత్రి , తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి చివరి శ్వాస విడిచే వరకు పోరాటం చేసిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం భూమిపూజ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల వెంకటేశం , కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ , కోశాధికారి సాయిని పురుషోత్తం , చేనేత సంఘం మాజీ అధ్యక్షులు ఏలూరి సుదర్శన్ , చేనేత సంఘం డైరెక్టర్లు వట్నాల వెంకటేష్ , జంజీరాల సోమయ్య , గుర్రం మల్లేషం , ఏలూరి ధనలక్ష్మి వెంకటేశ్వర్లు , రాపోలు శ్వేత వెంకటేష్ , మాజీ ఉపాధ్యక్షులు సాయిని అశోక్ , మాజీ డైరెక్టర్లు గుర్రం వాసుదేవ్ , ఏలే నిర్మల , ఏలే విశ్వనాథం , సాయిని వెంకటేష్ , ఏలూరి వెంకటేశ్వర్లు , రాపోలు వెంకటేష్ , చేనేత సంఘం ఆకౌటెంట్ వళ్ళందాస్ రమేష్ , చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు .





