హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10: ఈనెల 17 వతేదీన నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే తెలంగాణా ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పీ సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపంవద్ద, పబ్లిక్ గార్డెన్ లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకుగానూ ఈనెల 15 న పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు రెండు వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో* ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం
Telangana Chief Secretary Sanjay Jaju held a review meeting for the Praja Palana Day celebrations scheduled at Public Gardens on September 17.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
విద్యార్థినీల రక్షణలో ప్రభుత్వాలు విఫలం ఢిల్లీలో కదిలే బస్సులో విద్యార్థినిపై అత్యాచార ఘటన దీనికి నిదర్శనం

SFI national and state leaders criticized central and state governments for failing to ensure the safety of female students, highlighting the recent horrific bus assault case in Delhi.
మిగతా చదవండి →చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న సిపిఐ మండల నాయకులు

CPI mandal leaders paid rich tributes to Telangana armed struggle hero Chakalai Ailamma on her death anniversary in Yadadri Bhuvanagiri district.
మిగతా చదవండి →ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేదాసి మోహన్ మాదిగ

MRPS TS state leaders congratulated newly appointed state president Kedasi Mohan Madiga and national president Medi Papayya Madiga in Hyderabad.
మిగతా చదవండి →మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల కళాశాలను సందర్శించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

Yadadri Bhuvanagiri District Collector Anurag Jayanti inspected the Mahatma Jyotiba Phule Girls Gurukul School and College in Motakondur on Thursday.
మిగతా చదవండి →