చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 28 :
వ్యవహారిక భాషను వ్యతిరేకించిన వాళ్లను ఆయన వ్యతిరేకిస్తూ.. ఉద్యమాన్ని నడిపిన తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఎందరో మహానుభావుల మధుర స్మృతులలో భాగంగా గిడుగు వెంకట రామమూర్తి యాదిలో సభ
శ్రీ త్యాగరాయ గానసభ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదిక లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏనుగు నరసింహారెడ్డి పాల్గొని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి తో కలిసి
గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో చదువు సాహిత్యం కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే కఠినమైన 'గ్రాంథిక భాష'లో ఉండేదని సామాన్య ప్రజలకు కూడా విద్య, సాహిత్యం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన వ్యావహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గురజాడ అప్పారావు వంటి ప్రముఖుల సహకారంతో ప్రజల మాట్లాడే భాషనే గ్రంథ రచనకు, బోధనకు అనువుగా మార్చడానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. శ్రీ త్యాగరాయ
గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా. బ్రాహ్మణపల్లి జయరాములు, సిని దర్శకులు, గోసంరక్షకులు గోపాలకృష్ణ, సంఘసేవకులు చింతకింది విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








