హైదరాబాద్, కాచిగూడ, ట్రైనెట్.న్యూస్ ఆగస్టు 27 :
తెలంగాణలో చేయూత పథకం కింద పేద వర్గాలకు అందించనున్న కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రచార కార్యదర్శి జె.దశరథ్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. గురువారం నల్ల కుంటలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాం గులు, చేనేత, గీత కార్మికులు, వితంతు వులు, ఒంటరి మహిళలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంద ని, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంద ని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి అర్హుడికీ సామా జిక భద్రత కల్పిస్తా మని హామీ ఇచ్చిన కాంగ్రె స్ ప్రభుత్వం.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిరుపేదల దరఖా స్తులను స్వీకరించి, అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందజేయా లని సూచించారు. ఈ విషయాన్ని అధికారులు గమనించి దరఖాస్తుల గడువు పెంచడంతో పాటు కొత్తగా వృద్ధాప్య పెన్షన్లు కూడా మంజూ రు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.





