* నాచారం పోలీస్స్టేషన్లో శాంతి సమావేశం..
* నిబంధనలు పాటించాలని మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచన..
నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3:
వినాయక చవితి పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా గురువారం నాచారం పోలీస్ స్టేషన్ లో శాంతి సమావేశం నిర్వహించారు. డీఐ మాన్సింగ్ , ఎస్ఐ లు ప్రభాకర్రెడ్డి, గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వినాయక మండపాల నిర్వాహకులతో పలు అంశాలపై చర్చించారు. మండపాల ఏర్పాటులో పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. పండుగను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులు సూచించారు.





