హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26 : వేదం కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో "సీజన్ - 14" పేరిట తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. సంస్థ నిర్వాహకుడు, గాయకుడు
ఆనంద్ నిర్వహణలో ప్రశాంతి, నిర్మల, ప్రగతి, సరస్వతి, రామేశ్వరి, రుద్ర రెడ్డి, మురళి కృష్ణ, జి. శ్రీనివాస్, టి.కె.వి. మూర్తి
సుబ్రమణ్యం తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








